ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాల్లో 40 శాతం వృద్ధిని సాధించే లక్ష్యంతో యెస్ బ్యాంకు ఉద్యోగ నియామక కార్యక్రమంలో నిమగ్నమైంది. వచ్చే 9 నెలల్లో మొత్తం 900 మందిని నియమించుకోవాలని భావిస్తున్నట్లు బ్యాంకు ఒక ప్రకటనలో పేర్కొంది. 'ఈ ఆర్థిక సంవత్సరంలో 900 మందిని తీసుకుంటాం. ప్రస్తుతం మేం 2700 మంది ఉద్యోగులమున్నాం. మార్చి 2009 కల్లా ఈ సంఖ్యను 3600కు పెంచుతామ'ని బ్యాంకు ఎండీ, సీఈఓ రాణా కపూర్ పీటీఐకి తెలిపారు. 900 మందిలో 500 మంది మేనేజర్ల స్థాయి కాగా మిగతా 400 మందిని రిటైల్ సేవలు, విక్రయాల విభాగంలో తీసుకోనున్నట్లు ఆయన వివరించారు. అగ్రి-బిజినెస్, మౌలిక, ఇంధన, ఆరోగ్య సంరక్షణ, కమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో తమ దృష్టిని కేంద్రీకరిస్తామని ఆయన తెలిపారు.
ఈనాడు, 20-6-09



0 comments:
Post a Comment